- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
గమ్యం ఎక్కడో శిఖరాలమీద
ఉద్భవిస్తుంది,పడిలేస్తున్న ప్రాణానికి దర్పణంగా
పెదవి విరుస్తూ..
సామూహిక నిస్సహాయతకు
సాక్ష్యమన్నట్టు
వికటాట్టహాసం చేస్తూ..
వాడి ప్రశ్నల వాలుమీద
ఆత్మావలోకనమే ప్రయాణం..
ఆ నవ్వులు ముల్లుకర్రలు
ప్రతికూడలిలోనూ.. గుచ్చుతూ..
ప్రత్యామ్నాయం దొరికేలోపే
మైనపు రెక్కలు కరిగి
ఆత్మ విమర్శై పలుకరిస్తుంది.
Comments
Post a Comment